
గత కొద్దిరోజులుగా దేశంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది.
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
కర్ణాటకలో మోదీ గల్లీ గల్లీ ప్రచారం చేసినా బీజేపీ ని అక్కడి ప్రజలు తిరస్కరించారు.
మణిపూర్ అంశం చర్చకు వచ్చినా మోదీ పార్లమెంట్ కు
మణిపూర్ పై చర్చించకుండా ఇతర అంశాలతో ప్రజలను పక్కదారి పట్టించారు.
రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు నివేదికలు ఇచ్చాయి.
సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్ కు 38 శాతం, బీఆరెస్ కు 31 శాతం మాత్రమే అవకాశం ఉందని సర్వేలు చెప్పాయి.
బీజేపీ, ఎన్డీఏ కూటమికి అవమానకర పరిస్థితి ఎదురవుతుందనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెరమీదకు.
ఇండియా కూటమి వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానానికి వ్యతిరేకం.
అందుకే అధీర్ రంజన్ గారు కమిటీ నుంచి వైదొలిగారు
2018లో కేసీఆర్ జమిలి ఎన్నికలకు అనుకూలమని కేంద్రానికి లేఖ రాశారు.
ఎలక్షన్ కోడ్ తో రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకమని కేసీఆర్ స్వయంగా లేఖ రాశారు.
ఆ లేఖ ను బి.వినోద్ కుమార్ ఇచ్చి చౌహన్ గారికి పంపించారు.
బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్న కేసీఆర్… మీ బీఆరెస్ వైఖరి ఏమిటి?
బీజేపీ విధానాలకు మీరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టే కదా?
జమిలి బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి
జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం
ఈ దేశం రాష్ట్రాల సమూహం
ఒక పార్టీ చేతిలో అధికారం పెట్టుకోవడానికి బీజేపీ కుట్ర చేస్తుంది.
ఈ కుట్రను నేను ముందుగానే ఊహించి లోక్ సభలో ప్రస్తావించా
బీజేపీ ది వన్ నేషన్ వన్ పార్టీ విధానం అని నేను చెప్పా.
బీజేపీ తెచ్చిన ప్రతీ బిల్లుకు బీఆరెస్ మద్దతు ఇచ్చింది.
బీజేపీ, బీఆరెస్ వేరు వేరు కాదు.. అవి ఒకే తాను ముక్కలు.
అధ్యక్ష తరహా ఎన్నికలను తీసుకొచెందుకే బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం
దీని వెనక పెద్ద కుట్ర దాగుంది.
ఇది దేశ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం
అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగితే దక్షిణ భారత దేశం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే బీజేపీ కి అనుకూలమనుకోవాలా?
కేసీఆర్ వైఖరి ఏమిటో ప్రజలకు విస్పష్టంగా చెప్పాలి
కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రకు కేసీఆర్ సహకరిస్తున్నారు.
దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి..
మాజీ రాష్ట్రపతి ని వన్ నేషన్,వన్ ఎలక్షన్ కమిటీకి చైర్మన్ గా నియమించి ఆ పదవికి కళంకం తెచ్చారు.
రాజ్యాంగ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎలాంటి మార్పులు తెచ్చినా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది.
బీజేపీ మెడలు వంచుతుంది