
పద్మ విభూషణ్, ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా, ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
తెలంగాణ భాషకు అస్తిత్వ స్పృహ ను పెంచడంలో కాళోజీ ది కీలకపాత్ర అని సిఎం అన్నారు.
సామాజిక సమస్యలను అన్యాయాలను తట్టుకోలేక ప్రజలకోసం ‘తన గొడవ’ను కవిత్వం ద్వారా సున్నితంగా ఆవిష్కరించిన కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో,ప్రగతిలో ఇమిడి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు
తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున ప్రతి యేటా పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నది అని సిఎం అన్నారు.
ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను అందుకుంటున్న, ప్రముఖ కవి జయరాజు
కు సీఎం కేసిఆర్ మరోసారి అభినందనలు తెలిపారు.