
డిజిపి శ్రీ కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసిబి 14400 కాల్ సెంటర్ ద్వారా అవినీతి అధికారిపై వచ్చిన ఫిర్యాదులతో కృష్ణ జిల్లా, మండవల్లి మండల ఆఫీసు పై ACB అధికారులు దాడులు నిర్వహించారు.
కృష్ణ జిల్లా, మచిలీపట్నం కు చెందిన ఫిర్యాదిదారుడు శ్రీ బోయిన సాయి కిరణ్ తన అమ్మ, పిన్న భూమి కి పట్టాదారు పసుపుస్తకం కోసం కృష్ణ జిల్లా, మండవల్లి మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శ్రీమతి కందుల పద్మ రోజా ను కలవగా రూ.38,000/- రూపాయిలు లంచంగా డిమాండ్ చేయడంతో, ఫిర్యాదిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దీనిపైన కేసు నమోదు చేసుకున్న అధికారులు ఈ రోజు కృష్ణ జిల్లా, మండవల్లి మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శ్రీమతి కందుల పద్మ రోజా ఫిర్యాదిదారుడు వద్ద నుండి 38,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా విజయవాడ రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. మరి కాసేపటిలో నిందిత ఆధికారిని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తారు.
అవినీతి అధికారులపై ప్రజల ఫిర్యాదు కోసం 14400: అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించ వచ్చని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు.