
వారం రోజులపాటు నిర్వహించనున్న బ్రిటన్ వైద్య బృందం.
చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్ పేరుతో నిర్వహణ.
ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు మిలీనియం బ్లాక్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు.
పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచితంగా వారం రోజులపాటు గుండె ఆపరేషన్లు చేయనున్న ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప ప్రకటనలో తెలిపారు.
అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి, ఐదేళ్ల లోపు చిన్నారులకు గుండెలో రంధ్రం, ఇతర గుండె సంబంధిత వ్యాధులు ఉంటే ఇక్కడ చికిత్స అందిస్తారు.
బ్రిటన్ డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలో పదిమంది వైద్య బృందంతో పాటు నిమ్స్ కార్డియో థోరాసిక్ విభాగాధిపతి అమరేశ్వర రావు , వైద్య బృందంతో నిలోఫర్ ఆసుపత్రి వైద్యులు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నారు.