
నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్లో నూతన “రైల్ కోచ్ రెస్టారెంట్” ప్రారంభం
దీని కోసం ఉపయోగించని ఒక రైలు కోచ్ అంతర్గతoగా సుందరముగా తీర్చిదిద్దబడినది.
తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో రైల్వే కోచ్ థీమ్ తో ఏర్పాటు చేసి ప్రారంభించిన రైలు రెస్టారెంట్ లలో రెండవది
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించడానికి నిరంతర ప్రయత్నంలో మరో వినూత్న అడుగు ముందుకు వేసింది. సికింద్రాబాద్ జంట నగరాల్లోని మరొక ముఖ్యమైన రైల్వే స్టేషన్లో తన వినూత్న కార్యక్రమాలలో భాగంగా రైలు రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడానికి పూనుకుంది. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే లోని సికింద్రాబాద్ డివిజన్లోనున్న నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఆహార ప్రియులకు ప్రత్యేకమైన భోజన వాతావరణాన్ని మరియు వారికి ప్రత్యేకమైన అనుభూతిని అందించడానికి “రైల్ కోచ్ రెస్టారెంట్” ను ప్రారంభించింది. కాచిగూడ స్టేషన్ ప్రాంగణంలో ఇంతకుముందు ప్రారంభించిన “రెస్టారెంట్ ఆన్ వీల్స్” తర్వాత తెలంగాణ రైల్వే స్టేషన్లో ఇది రెండవ కోచ్ రెస్టారెంట్ .నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ జంట నగరాల సబర్బ్ నెట్వర్క్లోని అత్యంత రద్దీగా ఉండే రైలు స్టేషన్లలో ఒకటి. ఈ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చాలా వినోదాత్మకమైన ప్రదేశాలను కలిగి ప్రతిరోజూ మంచి సంఖ్యలో పర్యాటకులకు సేవాలనందిస్తున్నది. జంట నగరాల ఆహార ప్రియులకు అసమానమైన భోజన అనుభూతిని అందించడానికి, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ను కోచ్ రెస్టారెంట్ భావనతో ఏర్పాటు చేయడానికి ఎంపిక చేయబడింది. దీని కోసం, ఉపయోగించని ఒక కోచ్ ని ప్రయాణీకులకు ప్రత్యేకమైన భోజన అనుభూతిని అందించడానికి పూర్తిగా ఆధునిక మరియు అంతర్గతoగా సుందరముగా పునరుద్ధరించబడింది. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్లోని “రైల్ కోచ్ రెస్టారెంట్” ఐదు సంవత్సరాల కాలానికి హైదరాబాద్ కి చెందిన మెసర్స్ బూమరాంగ్ రెస్టారెంట్ వారి కి కేటాయించ బడినదిఈ బహుళ వంటకాల రెస్టారెంట్ రైలు ప్రయాణీకులకు మరియు సామాన్య ప్రజలకు భోజన అవకాశాన్ని కల్పించడానికి, స్టేషన్ పరిసర ప్రాంగణoలోని ఖాళీస్థలంలో తెరవబడింది. ఈ బహుళ వంటకాల రెస్టారెంట్ వినియోగదార్లకు పలహారం/ భోజనo అక్కడే సేవించడానికి మరియు వాటిని పార్శిల్ ద్వారా తీసుకొని వెళ్ళడానికి సదుపాయాన్నిఅందిస్తుంది. హైదరాబాద్లోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన ఈ కోచ్ రెస్టారెంట్ చొరవ వినియోగదారులకు మరపురాని భోజన అనుభవాన్ని అందించడంతో పాటు పాక శాస్త్రం లోని ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తుంది.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ప్రత్యేకమైన చొరవతో ఉపయోగించని కోచ్ని సుందరమైన రెస్టారెంట్ గా మార్పు చేసినందుకు సికింద్రాబాద్ డివిజన్ను ఆయన అభినందించారు. జంట నగరాల్లోని ఆహార ప్రియులకు ఈ జంటనగర ప్రాంతంలో మరోక విలక్షణమైన ఆహారానికి సంబందించిన ఎంపిక లభ్యమౌతుoదని ఆయన తెలియజేశారు. రైల్వేలు చేపడుతున్నఈ వినూత్న సౌకర్యాన్ని రైలు వినియోగదారులు మరియు సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.