
కే లక్ష్మణ్ బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు
తెలంగాణలో నవంబర్/డిసెంబర్ లో అసెంబ్లీ, మార్చి/ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. జమిలీ ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో మాజీ రాష్ట్రపతి నివేదిక వచ్చాక స్పష్టత వస్తుంది. పార్లమెంట్ లో పెట్టె అందరి అభిప్రాయాన్ని తీసుకొని నిర్ణయం ఉంటుంది.
చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ తప్పుపడుతుంది. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చెయ్యడం సరికాదు.బిఅరెస్ అవినీతి పాలనకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చరమగీతం పాడుతారు. యువతను ఆగంపట్టించి గారడీ చేస్తున్నాడు. నిరుద్యోగ యువత భవిష్యత్ ను అంధకారంలో నెట్టారు.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా 30 లక్షల మంది యువతను దగా చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కేసీఆర్ కి యువత బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని బీజేపీ ఉధృతం చేసింది. 30 లక్షల మందికి నిరుద్యోగ భృతి బాకీ పడింది. రాజకీయ కొలువుల భర్తీపై ఉండే శ్రద్ద ఉద్యోగ భర్తీపై లేదు. పేపర్ లీకేజీ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్నారు. యువరాజు పేపర్ లీకేజీ అంశంలో రాజీనామా చేయకుండా ఒక ఇద్దరిపై నెపం నెట్టి తప్పించుకున్నారు.
13 న జాబ్ కాలెండర్ విడుదల, ఖాళీల భర్తీ చేయాలంటూ 24 గంటలపాటు దీక్ష చేపట్టనున్నాం.13న ఇందిరా పార్కు వేదికగా 11 గంటలకు దీక్ష ప్రారంభం అవుతుంది. యువత పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చెయ్యాలి. ఉపాధ్యాయుల భర్తీలు చేపట్టక సర్కార్ బడులన్ని మూసేసి స్థితికి తీసుకొచ్చారు. చదువుకునే పరిస్థితి నుంచి చదువుకొనే పరిస్థితికి తీసుకొచ్చింది.
సెప్టెంబర్ 17 న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పేదప్రజాలకు కానుకగా ఇవ్వబోతున్నాం. ధన్యవాద్ మోడీజీ పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తాం.