
పీసీసీ చీఫ్ రేవంత్ చిట్ చాట్
రెండు సంవత్సరాలుగా తెలంగాణ కాంగ్రెస్ కి ప్రాధాన్యత పెరిగింది
ప్రాధాన్యత వ్యక్తులకు పెరగలేదు. పార్టీకి పెరిగింది
నేను పీసీసీ చీఫ్ అయ్యాక కోట్లాడి మా నాయకులకు పదవులు తెస్తున్న
గతంలో జరగని కార్యక్రమాలు ఈ రెండేండ్లలో జరిగాయి
నేను పీసీసీ చీఫ్ అయ్యాక అనేక మంది జాతీయ నాయకులు వరుసగా తెలంగాణకి వస్తున్నారు
తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి 2021 వరకు 156 మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు
2021 జూలై నుండి ఇప్పటి వరకు పార్టీ మారిన వాళ్ళు, వచ్చిన వాళ్ల లెక్క వేయండి
గతంలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయేవారు
ఇప్పుడు సిట్టింగులు కాంగ్రెస్లోకి వస్తున్నారు
రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గాంధీ భవన్ వచ్చి
చర్చలు జరిపారు. తర్వాత నేను పీసీసీ చీఫ్ అయ్యాకే వస్తున్నారు
ఎన్నికలున్న వేరే రాష్ట్రాల్లో CWC సమావేశాలు పెట్టకుండా తెలంగాణకే అవకాశం ఇచ్చారంటే తెలంగాణ కాంగ్రెస్ కి జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు
రెండేళ్లుగా మేం చేసినటువంటి సభలు అధికార పార్టీ కూడా చేయలేకపోయింది
మేం చేసిన గజ్వేల్, ఖమ్మం, ఇంద్రవెల్లి లాంటి సభలు కేసీఆర్ చేయలేకపోయాడు