
*తెలంగాణ కౌలు రైతుల సమస్యలపై పబ్లిక్ హియరింగ్ (బహిరంగ విచారణ)
*సెప్టెంబర్ 12, 2023, ఉ. 11.00 నుండి 2.30 వరకు, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్
*తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల గొంతు రాష్ట్ర స్థాయిలో వినిపించేందుకు రైతు స్వరాజ్య వేదిక ఒక పబ్లిక్ హియరింగ్ (బహిరంగ విచారణ)ను సెప్టెంబర్ 12వ తేదీన హైదరాబాద్ లో నిర్వహిస్తున్నది. పలు జిల్లాల నుండి 150 మంది కౌలు రైతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రముఖుల జ్యూరీ ముందు వారు తమ సమస్యలను స్వయంగా వివరిస్తారు. తరువాత జ్యూరీ సభ్యులు స్పందించి వారి తీర్పుని ఇస్తారు. అనేక రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కౌలు రైతుల సమస్యలపై స్పందిస్తారు.
*జ్యూరీ సభ్యులు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొ. యోగేంద్ర యాదవ్, టి. గోపాల రావు (మాజీ IAS), కవిత కురుగంటి*
*కౌలు రైతుల సమస్యల పై స్పందించే పార్టీల, ప్రజా సంఘాల నాయకులు:* మధు యాష్కీ (కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్), ప్రొఫెసర్ కోదండరామ్ (TJS అధ్యక్షులు), ఆర్. ఎస్ . ప్రవీణ్ కుమార్ (BSP అధ్యక్షులు), తమ్మినేని వీర భద్రం (CPM కార్యదర్శి), కూనంనేని సాంబశివరావు (CPI కార్యదర్శి), ఆకునూరి మురళి, జాగో తెలంగాణ కన్వీనర్, అంబటి నాగయ్య, TPJAC కోకన్వీనర్.