
శివసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ విద్యా శాఖ నిర్లక్ష్యంపై ఘాటైన వాఖ్యలు చేసారు. ఆ వివరాలు..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 600 మండాలాలకు కేవలం 16 మంది మాత్రమే రెగ్యూలర్ ఎంఈవోలు ఉండటమేంటనీ ద్వజమెత్తారు. 600 మంది ఎమ్ఈవోలకు కేవలం 16 మంది రెగ్యూలర్ ఎమ్ఈవోలు ఎలా ఉంటారనీ, స్కూల్ హెడ్ మాస్టర్ లకు ఇన్ చార్జ్ ఎమ్ఈవోలుగా బాధ్యతలు అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి ప్రొమోషన్ ఇవ్వకుండా ఉండటం దేనికి అంటు ఘాటుగా ప్రశ్నించారు. అర్హులైన ఉపాధ్యాయులకు పమొషణ్ ఇచ్చే వెసులుబాటు ఉన్నా చేతులు కట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రెగ్యూలర్ ఎమ్ఈఓ లు కేవలం 16 మంది మాత్రమే ఉన్నారని వారు కూడా 5 ఎస్సి, 11 ఎస్టీ వారే అంటు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఎస్సి,ఎస్టీ,బిసి బడుగు బలహీన వర్గాల పైన రాష్ట్ర ప్రభుత్వానికీ జాలి దయ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా బదిలీలు లేకుండా ఒకే దగ్గర పని చేస్తున్న 16 మంది రెగ్యూలర్ ఎమ్ఈఓ లను వెంటనే బదీలిలు చేసి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.
వనపర్తీ జిల్లాకు కేవలం ఒక ఎంఈవో మాత్రమే ఉన్నాడు. దాదాపు 20 జిల్లాలకు ఒక్క రెగ్యూలర్ ఎమ్ఈఓ కుడా లేడు అందరు ఇన్ చార్జ్ ఎమ్ఈవోలు ఉన్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 మంది రెగ్యూలర్ డిఈఓ లు ఉండాలి కాని 10 మంది రెగ్యూలర్ డిఈఓ లు మాత్రమే ఉన్నారి విమర్శించారు. మద్యం పైన ఉన్న ఆసక్తీ విద్య పైన ఎందుకు లేదు ఈ ప్రభుత్వాని ప్రశ్నించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రీకీ కనీసం ఈ విషయాలు తెలుసా అని ప్రశ్నించారు.
విద్యా వ్యవస్థ కి సంబంధించిన అధికారులు లేకపోతే వ్యవస్థలో మార్పూలు ఎలా సాధ్యం అవుతుందని అన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ లకు ఇన్ చార్జ్ ఎంఈవోలుగా బాధ్యతలుi ఇవ్వడం దేనికి అర్హులైన వారికి ప్రొమోషన్ ఇస్తే ఎం నష్టం వస్తుంది ప్రభుత్వానికని అన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ లకు ఇన్ చార్జ్ ఎమ్ఈఓ లుగా నాలుగు, ఐదు మండలాలకు బాధ్యతలు ఇవ్వడం వలన విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. 70 వెయిల పుస్తకాలు చదివిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఈ మాత్రం కుడా తెలియదా అంటు ప్రశ్నించారు.