
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారి ప్రెస్ మీట్ పాయింట్స్..
2023 సెప్టెంబర్ 16, 17, 18 దేశ రాజకీయాల్లో చరిత్రాత్మకమైనవి.హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభ, కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీ కార్డులను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు ఈ మూడు రోజుల్లో జరిగాయి.
ఈ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , ఏఐసీసీ నేతలకు, రాష్ట్ర స్థాయి నాయకులు, కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు.
70 ఏళ్ల తరువాత హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంలో పీసీసీ అధ్యక్షుడిగా నాకు గురుతర బాధ్యతను అప్పగించిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల రూ.2500,రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నాం.
రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15000, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12000 అందిస్తాం.
గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విత్యుత్ అందించనున్నాం. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందించనున్నాం.
యువ వికాసం ద్వారా చదువుకునే విద్యార్థులకు రూ.5లక్షల వరకు సాయం అందించనున్నాం. చేయూత పథకం ద్వారా రూ.4 వేలు పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనున్నాం.
వంద రోజుల్లో ఈ గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. బీఆరెస్ కు ఇక మిగిలింది మరో 99 రోజులే.
ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను నెరవేర్చారు. తెలంగాణ తల్లి సోనియమ్మను స్వాగతించాల్సింది పోయి.. బీఆరెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
బీఆరెస్ నేతలు రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. బహురూపు వేషాలు వేస్తూ అడ్డుకోవాలని చూశారు. సోనియాగాంధీ తెలంగాణకు రావడంతో బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం ల ముసుగులు తొలగిపోయాయి. బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం వేర్వేరు కాదు. వీళ్లంతా ఒక్కటే.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తన స్వప్నం అని నిన్న సభలో సోనియా చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ నేతలు కకావికాలం అవుతున్నారు. మేం ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళతాం.
గతంలో ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ నెరవేర్చింది. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పోడు భూముల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసి చూపించాం. నల్లధనం తెస్తామని, ఉద్యోగాలు ఇస్తామని మోదీ మోసం చేస్తే…దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు.. అంటూ కేసీఆర్ మోసం చేశారు.
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు..తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ పెట్టండి..ఎవరు మాట తప్పారో.. ఎవరు అమలు చేశారో తెలుస్తుంది.
ఇంటింటికి ప్రణాళికలు మారుతున్నట్లె… రాష్ట్రాల అవసరాల్లో తేడాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ప్రజల అవసరాలు, అనుగుణంగానే కార్యాచరణ ఉంటుంది…జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని హారీష్ మొండి వాదనలు చేస్తున్నారు.
వెర్రి మాటలు మాట్లాడి తిర్రిగా వ్యవహరిస్తే… ప్రజలు చీరి చింతకు కడతారు. ధరణిని 100శాతం రద్దు చేసి తీరతాం…ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం.
దొరల ధోరణికి ప్రతిరూపమే ధరణి. కేసీఆర్ దోపిడీ పాలనను బొంద పెట్టడం ధరనితోనే మొదలుపెడతాం. ధరణిని రద్దు చేసి మెరుగైన విధానాన్ని తీసుకొస్తాం.