
కరీంనగర్ హుస్సేనీపూరలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ కీలక నేత (తబ్రేజ్) ఇంట్లో గురువారం ఉదయం నుంచి సోదాలు జరుపుతోంది. ఈ సోదాల్లో ఎన్ఐఏతోపాటు, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగున్నర గంటలుగా పీఎఫ్ఐ నేత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో సదరు నేత ఇంట్లో లేరని తెలుస్తోంది. దుబాయ్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. నిషేధిత సంస్థతో లింకులు ఉన్నాట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున 3.30 నుంచి ఉదయం 8.30 వరకు తనిఖీలు జరిగాయి.