
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మంది పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యకపోవడం పై ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. సాయంత్రం 4 గంటల లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిపోర్ట్ సబ్మిట్ చెయ్యాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటాం అని వ్యాఖ్యానించింది.