
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో రాష్ట్రం అథోగతి పాలైంది.
కాంగ్రెస్ ఇచ్చిన సంపన్న తెలంగాణ రాష్ట్రం ముదనష్టపు బీఆర్ఎస్ పాలనలో అప్పులు కుప్పగా మారింది.
తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల రూపాయల అప్పల్లో మునిగిపోయిందని సాక్ష్యాత్తు కాగ్ చెబుతోంది.
బడ్జెట్ రణాలు, గ్యారంటీలు కలిసి రాష్ట్రాన్ని నిట్టనిలువునా అప్పుల్లో ముంచేశాయి.
తెచ్చిన అప్పులు ఏ కలుగులో ఉన్నాయో.. ఎవరి బొక్కసంలో భద్రంగా ఉన్నాయో ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది.
ఇవన్నీ ప్రగతి భవన్ నేలమాళిగలో దాక్కున్నాయి కాబట్టే దేశమంతా ఎన్నికల ఖర్చును భరిస్తాననే స్థాయికి కేసీఆర్ అవినీతి చేరింది.
తెలంగాణ వచ్చినప్పటినుంచి గత తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజలని తాగుడుకు బానిసలు చేసి.. రక్తమాంసాలను సైతం పీక్కుతిని 2 లక్షల కోట్ల రూపాయాలుగా మార్చుకున్నాడు.
అసరా పింఛన్ల రూపంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విదిల్చిన ముష్టి కేవలం 68 వేల కోట్ల రూపాయాలు మాత్రమే.
తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిట్టనిలువునా చంపేసి.. కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందళ్ల వంటి మూడు చెక్ డ్యాములు కట్టి.. లక్ష కోట్ల రూపాయాలను కేసీఆర్ దోచేశాడు.
కాళ్లేశ్వరం నీళ్లు అని చెబుతున్న కేసీఆర్.. ఆ ప్రాజెక్టుకు సంబంధించి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, పొలాలకు నీళ్లు తీసుకెళ్లే డిస్టిబ్యూటరీ కెనాల్స్ ను ఎక్కడైనా ఏర్పాటు చేశాడా?
తెలంగాణ భూములకు పారుతున్న నీళ్లన్నీ నాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు, వాటికి తవ్విన కాలువల ద్వారా మాత్రమే అని నేను స్పష్టంగా చెబుతున్నాను.
రాష్ట్రాన్ని ఆర్థిక వినానం వైపు తీసుకెళ్లిన్న పొలిటికల్ టెర్రరిస్ట్ కేసీఆర్ కు తెలంగాణ బిడ్డలు వచ్చే ఎన్నికల్లో మర్చిపోలేని గుణపాఠం చెబుతారు.