
ఖమ్మం పార్లమెంటు పరిధిలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇంచార్జ్ ల నియామకం.
ఖమ్మంకు కూరపాటి వెంకటేశ్వర్లు, పాలేరుకు కొండబాల కరుణాకర్, సత్తుపల్లికి రామకోటేశ్వర రావు, వైరాకు చెరుకూరి చలపతిరావుకు బాధ్యతలు.
నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.
ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ లను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా కూరపాటి వెంకటేశ్వర్లు, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా కొండబాల కరుణాకర్, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా నాయుడు రామకోటేశ్వర రావు(కోటి), వైరా అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా చెరుకూరి చలపతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కాసాని జ్ఞానేశ్వర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.