
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్లోని సెలబ్రిటీ రిసార్ట్ క్లబ్ లో భారీ చోరీ జరిగింది. క్లబ్ లోని విల్లా నంబర్ 9లోని మహేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఆయన న్యూజీలాండ్లోని తన కూతురు ఇంటికి వెళ్లగా సంఘటన చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున 4.5 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. బందువు ఇంటికి వచ్చి చూడగా వేసిన తాళం పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.