
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో అవినాష్ నేడు సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు.గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ చార్జిషీట్ వేసింది. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది. 145 పేజీల తో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీబీఐ.
ఇక జూన్ 19 తేదీన సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాసిన అవినాష్ రెడ్డి దర్యాప్తును పునః సమీక్షించాలని కోరారు. గత దర్యాప్తు అధికారి రాంసింగ్ పై ఆరోపణలు చేసిన అవినాష్ రెడ్డి సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ సీట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబిఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లెక్కలో పేర్కొన్న అవినాష్ రెడ్డి వాటిపై మరోసారి పునః పరిశీలన చేయాలని పేర్కొన్నారు. ఇక ఈ లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.