
సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కొవ్వొత్తుల ప్రదర్శన.
2023 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజల స్వాతంత్రయాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలని, దేశ రైతంగా ని కీ ప్రధానమంత్రి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను-మద్దతు ధనల గ్యారెంటీ చట్టం చేయాలని రుణమాఫీ చట్టం చేయాలని పంటల బీమా పథకంలో కార్పోరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధానాన్ని సవరించి రైతులకు అనుకూలంగా మార్చి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మతోన్మాదులను విచ్ఛిన్నకర శక్తులను తరిమి కొట్టడానికి అనేకమంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న
స్వాతంత్ర్యాన్ని, రాజ్యాంగాన్ని రైతులు దేశ ప్రజలందరూ కాపాడుకోవటానికి సమాయత్తం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు బ్యాంకు రుణాలు పోటు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని ధరణిలో దొర్లిన లోపాలను సవరించి రైతాంగం ఎదుర్కొంటున్న పరిష్కరించాలని రుణమాఫీలో రైతులకు భారంగా ఉన్న వడ్డీ చెల్లించడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పశ్యపద్మ, టీ సాగర్, వి. కోటీశ్వరరావు, మామిడాల బిక్షపతి, పుస్తెల సృజన, మూడు శోభన్ ,ప్రభు లింగం, అంజయ్య నాయక్, తదితరులు నాయకత్వం వహించారు.