
బి అర్ ఏస్ కి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ రాజీనామా చేసినట్లు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన అభ్యర్థుల జాబితా తీవ్ర నిరాశను కలిగించింది అన్నారు.
ఆత్మగౌరవం లేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకే పార్టీని వీడాను అని తెలిపారు.2018 నుంచి పార్టీలో ఉన్న తగిన ప్రాధాన్యత లభించలేదన్నారు. బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్
అని అన్నారు. భూస్వాములకు పెత్తందారులకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీలో కొనసాగడం సరికాదని సన్నిహితులు మిత్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్న అని అయన అన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయింపు జరగలేదు , నాలుగైదు రోజులలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తా అని తెలిపారు.