
వాట్సాప్ డీపీ మార్ఫింగ్.. ఇన్స్టాలో ఫొటోలు వైరల్.. ఇద్దరు యువతుల సూసైడ్
నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు.
కొంతమంది ఆకతాయిలు.. తమ వాట్సాప్ డీపీలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి.. సామాజిక మాధ్యమాల్లో పెట్టారనే మనస్తాపంతో నల్గొండలోని రాజీవ్ పార్కులో మంగళవారం ఇద్దరు యువతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
అనంతరం పార్కు గేటు బయట ఉన్న ఓ చెట్టు కిందకు వచ్చి పడిపోయారు.
గమనించిన స్థానికులు యువతులిద్దరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ నేడు ఆ ఇద్దరు మృతి చెందారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
