లేదంటే మేమే బయటపెడతాం
అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టు సాక్ష్యం
గిన్నీస్ రికార్డు కోసమే కట్టారు
అన్నీ నేనే అనే ముఖ్యమంత్రి తీరుతోనే సమస్యలు
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎస్ చీఫ్ కోదండరాం, రిటైర్డ్ ఇంజినీర్లు
కోదండరాం, టీజేఎస్ ఛీఫ్…
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాం సేఫ్టీ రిపోర్ట్ బయట పెట్టాలి. – ప్రాజెక్టు అధ్భుతాలపై రాష్ట్ర ప్రభుత్వం తన ప్రగల్భాలు ఆపాలి. సీఎంనే అన్ని పనులు చేస్తానంటే ఎట్లా..?- కాళేశ్వరం సర్వే చేయలేదు. ఉంటే రిపోర్ట్ లు బయట పెట్టాలి. గిన్నీస్ రికార్డు కోసమే కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతిమ సాక్ష్యం.. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేకపోవడమే కారణమని తెలుస్తోంది. పై నుంచి ఆదేశాలతోనే పాలన నడుస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, దేవాదుల ప్రాజెక్టులు ధృడంగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది.? అధికార దుర్వినియోగం కారణంగా కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై సమగ్ర దర్యాప్తు జరగాలి. డ్యాం సేఫ్టీ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను ప్రజలముందు ప్రభుత్వం ఉంచాలి. లేదంటే మేమే ప్రజలముందు ఉంచుతాం.
నర్సింహారావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్
మేడిగడ్డ చాలా క్రిటికల్ ప్రాజెక్టు. బ్యారేజ్ లు 5 టీఎంసీల వరకే నిర్మిస్తారు. డెల్టా ప్రాంతంలోనే వీటిని కడతారు. కాళేశ్వరంలో డిజైన్ డైవర్షన్ మెంట్ లేదు. రికార్డ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.మేడిగడ్డను స్టోరేజ్ చేయని పక్షంలో ఎప్పుడూ ఫ్లష్ చేస్తూ ఉండాలి. త్రిశంకు స్వర్గంలా కాళేశ్వరం ఉంది. ప్రాజెక్టుపై రీ స్టడీ చేయాలి.
రంగారెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్…
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం తప్పులు చేసింది. ప్రాజెక్టును తొందరగా, తక్కువ కాలంలో ప్రభుత్వం నిర్మించడంతోనే లోపాల సమస్యలు తలెత్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు థియరీ, ప్రాక్టికల్ కు చాలా తేడాలు ఉన్నాయి. ప్రాజెక్టును కేంద్రం రీ చెక్ చేయించాలి. తెలంగాణలో మంచి ఇంజినీర్ల ఉన్నారు. వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
రఘుమారెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్…
కాళేశ్వరం ప్రాజెక్టు సర్వేనే సరిగా చేయలేదు. ఎల్ అండ్ టి సంస్థను నిందించడం తగదు. తప్పు ఉంటే రీ సర్వే చేయాలి. -ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ను ఎందుకు పక్కనపెట్టి కాళేశ్వరం కట్టారు?-కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను సీజ్ చేయాలి. బాధ్యులైన ఇంజినీర్లు, అధికారులను జైలులో పెట్టాలి. -రాఫ్ట్ పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ కుంగుబాటుకు గురైంది. -ప్రాణహిత ప్రాజెక్టు ను మళ్లా నిర్మించాలి. -లక్ష యాభై వేల కోట్ల నిధులు నాశనం చేసిన వాటికి ఎవరు బాధ్యులు..?
శ్యాం ప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్…
వాటర్ ఫ్లో కంటిన్యూటీ ఉన్న చోటనే బ్యారేజ్ నిర్మించాలి. మేడిగడ్డను బ్యారేజ్ రూపకంగా రిజర్వాయర్ గా నిర్మించారు. ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేళ్లు అయినా పరిశీలన చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రెక్టిఫికేషన్ చేయించాలి. ప్రభుత్వం స్పందించాలి.
పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు…
కాళేశ్వరం అంటే కేసీఆర్ ఖజానా కాళీశ్వరం. కేసీఆర్, బీఆర్ఎస్ మాటలు ఎవరూ నమ్మడం లేదు. కాళేశ్వరం డీపీఆర్ లేదు. కాళేశ్వరం లోపాలకు ప్రభుత్వం, ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థనే దోషులు. లిక్కర్(బీఆర్ఎస్) పార్టీ, నిక్కర్(బీజేపీ)పార్టీలు ఏకమైయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద కుంభకోణం
రౌండ్ టేబుల్ సమావేశ తీర్మానాలు
కాళేశ్వరం ప్రాజెక్టు పై సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రాజెక్టు లోపాల పై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేంద్రం కూడా బాధ్యత వహించాలి.