
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారి ప్రెస్ మీట్ పాయింట్స్..
దాడులు చేసి ఎన్నికల్లో గెలవలనుకునే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారు
కొడంగల్ ను దత్తత తీసుకుంటామని ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చి మోసం చేశారు.
హైదరాబాద్-బీజాపూర్ హైవే తెచ్చింది నేను..
కొడంగల్ లో కట్టిన గుడి, బడి అన్నీ నా హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే.
కొడంగల్ కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేను కాదా?
కొడంగల్ నియోజకవర్గానికి 30 సబ్ స్టేషన్లు తెచ్చింది మేము..
కొడంగల్ ప్రజలకు బస్ డిపో తెచ్చింది మేము…
నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి మా హయాంలోనే జరిగింది.
బీఆరెస్ హయాంలో నారాయణ్ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకుండా కొడంగల్ కి అన్యాయం చేశారు..
నేను చేసిన పనులకు శిలాఫలకాలు వేయడం తప్ప బీఆరెస్ చేసిందేం లేదు.
జిల్లాలు పెంచి కొడంగల్ ను ముక్కలు చెక్కలు చేశారు.
కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటే కొడంగల్ కు ఏం జరిగింది?
రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామన్న కేసీఆర్…
ఐదేళ్లయినా ఎందుకు తీసుకురాలేదు.
లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్ కు నీళ్లు రావు
కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను కూడా నిర్మించలేదు.
మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆరెస్ భావిస్తోంది.
మీరు దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరు..
మీరు చేతితో కొడితే.. ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొడతారు.
దాడులు చేయడం మా విధానం కాదు… అభివృద్ధి చేయడమే మా విధానం
పేదల జీవన ప్రమాణాలు పెంచి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే మా విధానం
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందించడమే మా విధానం
ప్రతీ నెలా మొదటి తారీఖున రూ.4వేలు పెన్షన్ ఇవ్వడం మా విధానం
ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు సాయం చేయడం మా విధానం
రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకోవడం మా విధానం
కేసీఆర్ ఒడిపోతుండు కాబట్టే గజ్వేల్ నుంచి పారిపోతుండు..
కేసీఆర్ ఓటమి ఖాయమైంది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతుండు
ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా కనిపిస్తోంది.
కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుంది… హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు.
గుర్నాథ్ రెడ్డి సూచనతో నేను కొడంగల్ నుంచే పోటీకీ ఇవాళ గాంధీభవన్ లో దరఖాస్తు చేస్తాం
మీరంతా ఆశీర్వదించాలని కోరుతున్నా..